Shriyareddy and vinayakan :  కొన్ని  సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా.. అవి ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తాయి. దాదాపు 17 ఏళ్ళ క్రితం ఒకే సినిమాలో నటించిన ఓ ఇద్దరు నటీనటులకు.. 2023 లో విలన్స్ గా బ్రేక్ రావడం విశేషంగా చెప్పుకోవాలి. వారిలో ఒకరు శ్రీయా రెడ్డి అయితే మరొకరు మలయాళ నటుడు వినాయకన్. ఈ ఇద్దరూ 2006 లో ‘పొగరు’ అనే సినిమాలో కలిసి నటించారు. ఇందులో శ్రీయారెడ్డి ఈశ్వరి అనే పొగరబోతు అమ్మాయిగా నటిస్తే ఆమె అసిస్టెంట్ గా దివ్యాంగుడిగా మాయి అనే పాత్రలో వినాయకన్ నటించాడు.

కట్ చేస్తే .. 2023 వ సంవత్సరంలో రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో వర్మ అనే విలన్ గా నటించి అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ఇతడి నటనకు మంచి అప్లాజ్ లభించింది. అలాగే.. ఈ ఏడాది చివరలో ప్రభాస్ సలార్ మూవీలో రాధారామ అనే పాత్రలో జగపతి బాబు కూతురిగా నటించి శ్రీయారెడ్డి ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆమెకు ఇప్పుడు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చిపడుతున్నాయి. మొత్తానికి ఒకే ఏడాది ఈ ఇద్దరికీ విలన్స్ గా బ్రేక్ రావడం విశేషమనే చెప్పాలి.

Leave a comment

error: Content is protected !!