సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో దర్శకుడు రమేష్ చెప్పాల తెరకెత్తిన “లగ్గం” చిత్రం టాకీ పార్ట్ శరవేగంగా పూర్తి అయ్యింది. జనవరిలో ప్రారంభమైన ఈ చిత్రం తెలుగు సంస్కృతి, పెళ్ళిళ్ళలోని మజా, మర్యాదలు, ఆటపాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్ముతోంది. ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు గార్ల నటన, దర్శకుడు రమేశ్ చెప్పాల స్టైలిష్ మేకింగ్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తాయని నమ్ముతున్నారు.

“పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా పిలిచినా జంట ఒకటవ్వడమే! ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం… ఈ లగ్గం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది” అని దర్శకుడు రమేశ్ చెప్పాల చెప్పారు. తెలుగు సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. చరణ్ అర్జున్ అద్భుతమైన సంగీతం, బేబీ సినిమా కెమెరామెన్ బాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ “లగ్గం” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బొంతల నాగేశ్వర రెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!