Shopping Cart 0 items - $0.00 0

వాయిదా పడిన అనుష్క ‘నిశ్శబ్దం’….?

 

లాస్టియర్ మెగాస్టార్ ‘సైరా’ చిత్రంలో ఝాన్సీ లక్ష్మి బాయ్ పాత్రలో కనిపించి అభిమానులకు కనువిందు చేసింది స్వీటీ అనుష్క.  ఇక ఈ ఏడాది ఆమె ‘నిశ్శబ్దం’ అనే వైవిధ్యమైన చిత్రంలో కథానాయికగా నటించింది. అందులో అనుష్క మూగ, చెవుడు  పాత్ర చేస్తోంది. తమిళ నటుడు మాధవన్ మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.  ‘వస్తాడు నారాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి ఈ నెల 31న విడుదల కావాలి.  అయితే ఈ సినిమా ఫైనల్ కట్ ఏమంత సంతృప్తికరంగా రాలేదని అనుష్క, నిర్మాతలు భావించడంతో ‘నిశ్శబ్దం’ చిత్రం వాయిదా పడినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.

ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ పార్ట్ అనుష్క కు అసలేమాత్రం నచ్చలేదట. మరింత బెటర్ గా ఆ సీక్వెన్స్ ను రాసుకు రమ్మని దర్శకుడు హేమంత్ కు అనుష్క సూచించిందట. అంతేకాదు అది తనకు  సంతృప్తికరంగా వస్తేనే నిశ్శబ్దం ప్రమోషన్స్ కు హాజరవుతానని అనుష్క దర్శక, నిర్మాతలకు కండీషన్ కూడా పెట్టిందట. అందుకే ఈ సినిమా కోసం మేకర్స్ మరో మంచి డేట్ కోసం చూస్తున్నారట. మరో వైపు ఈ సినిమాకి ఒక నిర్మాతైన కోన వెంకట్ ‘నిశ్శబ్ధం’ చిత్రాన్ని ఎలాగైనా అదే డేట్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు , తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో విడుదలకానున్న ‘నిశ్శబ్దం’ చిత్రం అదే డేట్లో రిలీజ్ అవుతుందో లేక కొత్త డేట్ ఫిక్స్ చేసుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!