‘అల వైకుంఠపురములో’ చిత్రం అఖండ విజయం తర్వాత బన్నీ..  సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే  ఈ సినిమా శేషాచలం అడవులు, ఆ చుట్టుపక్కల షూటింగ్ జరుపుకోనుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా లో కథానాయికగా అందాల రష్మికా మందణ్ణ నటించనుంది. అలాగే.. విలన్ గా తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం సుక్కూ మరో విలన్ ను రంగంలోకి దింపనున్నాడట.

‘ఇస్మార్ట్ శంకర్’ లో తన తండ్రినే చంపించి ఆ స్థానంలోకి వచ్చిన హోం మినిస్టర్ పాత్ర ధారి అయిన కన్నడ నటుడు రాజ్ దీపక్ షెట్టి బన్నీసుక్కూ చిత్రంలో కూడా విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో అతడు ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. లారీ డ్రైవర్ గా బన్నీ నటిస్తూండగా.. అతడికి అడుగడుగునా అడ్డు తగిలి అతడ్ని రెచ్చగొట్టే పాత్రలో రాజ్ దీపక్ షెట్టి నటించబోతున్నాడట. రీసెంట్ గా  ఇతడు  నటించిన ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. దానికి తోడు ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా సూపర్ హిట్టు అవడంతో .. రాజ్ దీపక్ షెట్టి టాలీవుడ్ దర్శకులకు విలన్ గా మంచి ఆప్షన్ అయిపోయాడు. మరి బన్నీ సినిమాలో ఈ నటుడు ఏ స్థాయిలో విలనిజాన్ని పండిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!