సరస్వతీ దేవి కటాక్షంతో ఐదు భాషల్లో సినిమాలకు రచన చేసిన జనార్ధన మహర్షి, ఆరో భాషగా పంజాబీలోకి అడుగుపెడుతున్నారు. తెలుగులో అనేక విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన జనార్ధన మహర్షి, తన ప్రత్యేకమైన రచనా శైలితో తెలుగు సినిమా రంగాన్ని శాసించారు. దాదాపు 75 తెలుగు చిత్రాలకు పనిచేసిన ఆయన, కన్నడ సూపర్‌స్టార్లతోనూ పనిచేసి, కన్నడలోనూ స్టార్ రచయితగా గుర్తింపు పొందారు. తమిళంలో రెండు, మళయాలంలో ఒక చిత్రానికి రచన చేసిన జనార్ధన మహర్షి, ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలకు రచనా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు, భారతదేశమంతా తనదే అన్నట్లుగా, ఏ భాషలోనైనా సినిమాను ప్రేమించి, శ్వాసించే జనార్ధన మహర్షి, పంజాబీ భాషలోకి అడుగుపెడుతున్నారు. మనిష్ భట్ దర్శకత్వంలో పంజాబీ సూపర్‌స్టార్ జయ్ రంధావా, ధీప్ సెహగల్ జంటగా నటిస్తున్న “జి జాట్ విగడ్ గ్యా” చిత్రానికి జనార్ధన మహర్షి రచన చేస్తున్నారు. ఈ చిత్రం మే 17న విడుదల కానుంది. ఈ పంజాబీ చిత్రానికి రచన చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని జనార్ధన మహర్షి తెలిపారు. ఈ చిత్రం ట్రైలర్‌కు భారీ స్పందన రావడంతో సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని, పంజాబీలోనూ రచయితగా మంచి విజయాన్ని సాధిస్తానని ఆయన నమ్ముతున్నారు.

Leave a comment

error: Content is protected !!