Vijay Sethupathi : తన సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టాల సమయంలో మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా తనకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిందని, ఈ సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం తనను ఎంతగా ప్రభావితం చేసిందో వివరించారు.. తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి . ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మహారాజా సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ సేతుపతి, తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ, ‘అతడు’ సినిమాలోని ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం తనను ఎంతగా ప్రభావితం చేసిందో వివరించారు. ముఖ్యంగా, సినిమాలోని పాత్రల భావోద్వేగాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత అద్భుతంగా తెరకెక్కించారో ఆయన ప్రశంసించారు.

కమర్షియల్‌గా అంతగా ఆడకపోయినా ‘అతడు’ సినిమా ఇప్పటికీ చాలా మందికి ప్రియమైన సినిమాగా నిలిచింది. మహేష్ బాబు కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలు వచ్చినా కూడా ‘అతడు’ చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన ఫ్యాన్స్ అంటూ ఉంటారు. విజయ్ సేతుపతి కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ‘అతడు’ సినిమా తనకు ఎంతో ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు.

విజయ్ సేతుపతి తన కెరీర్ ప్రారంభంలోనే 50 సినిమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళ సినీ వర్గాలు ఆయన రాబోయే నాలుగు అయిదు సంవత్సరాల్లోనే వంద సినిమాల మార్క్‌ను అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. మహారాజా సినిమా తమిళనాట బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి, ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా రికార్డ్‌లు సృష్టిస్తోంది. విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.

విజయ్ సేతుపతి ఒక వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్‌గా కూడా నటిస్తున్నారు. ఆయన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా, ‘అతడు’ సినిమాలోని బ్రహ్మానందం కామెడీ మరియు త్రిష అందం, నటన గురించి విజయ్ సేతుపతి ప్రశంసలు కురిపించారు.

Leave a comment

error: Content is protected !!