Varun Tej : గత కొన్ని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఓటమి చవిచూసినా, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ధైర్యం కోల్పోలేదు. కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తూ, ప్రస్తుత ట్రెండ్ కి అనుగుణంగా కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా, పాన్ ఇండియా స్థాయి మాస్ యాక్షన్ చిత్రాలపై దృష్టి పెడుతున్నాడు.

కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ మట్కా. వైజాగ్ నేపథ్యంలో మాఫియా కథాంశంతో ఒక పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇందులో వరుణ్ తేజ్ సరికొత్త మేకోవర్ తో అండర్ వరల్డ్ కింగ్ పిన్ గా కనిపించబోతున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం లో వరుణ్ తేజ్ ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించడానికి వరుణ్ లేటెస్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.

విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించే మరో సినిమాలోనూ వరుణ్ నటిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథ, టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ రూపొందించిన కథ. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. మొత్తం మీద 2025 లో వరుణ్ తేజ్ నుండి మూడు సినిమాలు రాబోతున్నాయని, ఈ చిత్రాలతో తన మార్కెట్ ను మళ్లీ బలోపేతం చేసుకోవాలని అతను ఆశిస్తున్నాడని టాక్. వరుణ్ తేజ్ తన కెరీర్ లో మళ్ళీ విజయం సాధిస్తాడా? అనేది వేచి చూడాలి.

Leave a comment

error: Content is protected !!