Shopping Cart 0 items - $0.00 0

‘సరిలేరు నీకెవ్వురు’కు ‘అగ్ని పర్వతం’ సెంటిమెంట్

 

 

సూపర్ స్టార్ మహేశ్ బాబు , అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా రేపే విడులవుతోన్న సంగతి తెలిసిందే. టీజర్ , ట్రైలర్ తో  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా గట్టిగానే సక్సెస్ సౌండివ్వబోతోందన్న క్లూ కూడా ఇచ్చేశారు. ‘భరత్ అనే నేను, మహర్షి’ చిత్రాల వరుస విజయాలతో జోరు మీదున్న మహేశ్ బాబు, ఇప్పటి వరకూ తన కెరీర్ లో అపజయం అన్న పదానికే తావివ్వని అనిల్ రావిపూడి కలయికలో రానున్న సినిమాగా కూడా ఇది అందరిలోనూ అంచనాల్ని పెంచేసింది . ఇదిలా ఉంటే..  ఈ సినిమాకి మరో ఆసక్తికరమైన అంశం కూడా  ఓ సెంటిమెంట్ గా మారింది.

సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అంటే.. 1985 , జనవరి 11న సూపర్ స్టార్ కృష్ణ ‘అగ్ని పర్వతం’ విడుదలై.. అప్పట్లో సంచలన విజయం సాధించింది. అసలే సంక్రాంతి మొనగాడని పేరున్న కృష్ణ అదే రోజున విడుదలైన సినిమాలన్నిటినీ బీట్  చేసి తన సంక్రాంతి సెంటిమెంట్ ను మరోసారి చాటుకున్నారు.  ఇప్పుడు అదే రోజు రానున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా ‘అగ్ని పర్వతం’ రేంజ్ లో రికార్డులు బద్దలు కొడుతుందనే కాన్ఫిడెన్స్ మహేశ్ ఫ్యాన్స్ లో పుష్కలంగా ఉంది. అంతే కాదు .. అగ్నిపర్వతంలో విజయశాంతి కథానాయికగా నటించి.. ఆ సినిమాకి మంచి గ్లామర్ యాడ్ చేసింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వురు లో కూడా విజయశాంతి ప్రధాన పాత్ర పోషించడం కూడా మరో సెంటిమెంట్ గా మారుతుందని   కూడా భావిస్తున్నారు.   గతంలో మహేశ్ బాబు చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదలైనా.. అందులో  కొన్ని  మాత్రమే మ్యాజిక్ చేయగలిగాయి. మరి ఈ సారి ‘అగ్ని పర్వతం’ హిట్టు సెంటిమెంట్ కు తోడు విజయశాంతి ప్రెజెన్స్ కూడా కలసొచ్చి..   ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సూపర్ హిట్టయి.. మహేశ్ బాబు కు సార్ధక నామంగా మారుతుందేమో చూద్దాం.

Leave a comment

error: Content is protected !!