కన్నడ రాక్ స్టార్ యష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’ . ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు ఫ్యాన్స్ ను ఖుషీ చేయబోతున్నాయి. నెలల తరబడి ఊహాపోహాలు, ఆసక్తి తర్వాత.. ఈ మూవీ చిత్రీకరణ కర్ణాటకలో అధికారికంగా ప్రారంభమైందని సమాచారం అందుతోంది. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో సోషల్ మీడియాలో ఆకర్షణగా మారింది.

ఆ ఇంట్రెస్ట్‌ను మరింతగా పెంచేందుకు, యష్ గత బ్లాక్‌బస్టర్ ‘కేజీఎఫ్’ సక్సె్స్ ఫార్మేట్ లో భాగంగా.. టాక్సిక్ మూవీని కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. నిర్మాణ సంస్థ నుండి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉండగా.. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇంక టాక్సిక్ మూవీ నటీనటుల ఎంపిక కీలకంగా మారింది. ప్రధాన నటీమణుల కోసం వేట సాగుతోంది. బాలీవుడ్ నుండి కరీనా కపూర్, కియారా అద్వాని, శృతి హాసన్ లాంటి బ్యూటీస్ ఈ పాత్రలకు అనుకున్నట్టు తెలుస్తోంది.
‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ అసాధారణమైన విజయం తర్వాత యష్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘టాక్సిక్’. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యాక్షన్, ఫాంటసీల అద్భుతమైన కలయికగా తెరకెక్కబోతోంది. కేవీయన్ ప్రొడక్షన్స్ , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భారీ పాన్-ఇండియా బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న విడుదల తేదీగా ప్రచారం జరుగుతోంది.

Leave a comment

error: Content is protected !!