మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘డిస్కోరాజా’.  ఈ నెల 24న గ్రాండ్ గా విడుదలవడానికి రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్  ఓ రేంజ్ లో ఊదరగొడుతున్నారు. ఇప్పటికే రెండు టీజర్స్ ను, రెండు పాటల్ని విడుదల చేసిన ఈ మూవీ టీమ్ .. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను కూడా వదిలారు. రమ్ పమ్ బమ్.. అంటూ సాగే ఈ డిస్కోసాంగ్ కు ఎంతో ప్రత్యేకత ఉంది.

ఒకప్పుడు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ నూ.. తన సంగీతంతో ఓలలాడించిన మ్యూజికల్ మెజీషియన్  బప్పీలహరి ఈ పాటలో రవితేజ, శ్రీకృష్ణలతో గొంతుకలపడం విశేషం. సిరివెన్నెల సీతారామశాస్త్రి చాలా సింపుల్ రాసిన “కాలం ఆగాలి నా కాలి వేగం చూసి లోకం సాగాలి నా వేలి సైగే తెలిసి కొండలే ఊగి పోవాలి నా జోరుకి.. దిక్కులే పారిపోవాలి నా హోరుకి” అనే పాట తమన్ సంగీత సారధ్యంలో రూపుదిద్దుకుంది.  అప్పట్లో  బప్పీలహరి కంపోజ్ చేసిన పాటల స్టైల్లోనే సాగుతూ.. న్యూజెన్ ఇన్ స్ట్రుమెంటేషన్ తో మిక్సైన ఒక సూపర్ ట్యూన్ ను  తమన్ అందించాడు. పీరియాడికల్ యాక్షన్ అండ్ లవ్ డ్రామా గా సాగే ఈ డిస్కోరాజా మూవీ మరో సారి తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!