జీ5 భారతదేశంలో అతిపెద్ద ఓటీటీ మీడియా. ఇది వివిధ భాషలలో విభిన్న చలనచిత్రాలు మరియు ధారావాహికలతో వీక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందిస్తుంది. అదేవిధంగా, రాబోయే పొలిటికల్ థ్రిల్లర్ తలమై సెయల్గం మే 17 నుండి జీ5లో ప్రసారం కానుంది. ఈ సిరీస్‌కి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తమిళ రాజకీయాల్లో అధికార దాహాన్ని చూపించేందుకు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో దీన్ని రూపొందించారు. 8-భాగాల పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై రాధికా శరత్ కుమార్ నిర్మించారు. జాతీయ అవార్డు గ్రహీత వసంత బాలన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కిషోర్, శ్రియా రెడ్డి, ఆదిత్య మీనన్, భరత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!