Matka movie : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మట్కా”. డా. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలుగా ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందించబడింది. కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రత్యేకంగా రూ.15 కోట్ల వ్యయంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో పాత విశాఖపట్నం నగరాన్ని పోలి ఉండే భారీ సెట్స్‌ను నిర్మించారు. ఈ సెట్స్‌లోనే 35 రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పాత విశాఖపట్నం నగరాన్ని పునఃసృష్టించిన తీరు, నిర్మాణ విశేషాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వరుణ్ తేజ్ ఓ మరపురాని పాత్రలో నటిస్తూ, తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచేలా చేస్తున్నారు అని చిత్రవర్గాలు వెల్లడించాయి. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి.రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. “మట్కా” చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!