మలయాళ వెర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ లేటెస్ట్ గా ‘ఆవేశం’ సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద హిట్ అందుకున్నాడు. కేరళ బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టింది. కేరళ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు ఎంతటి ఆదరణ లభించిందో దీన్ని బట్టి అర్ధమవుతోంది. ఇతర మార్కెట్లలో కూడా ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఫహద్ ఫాసిల్‌ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ “ఆవేశం” సినిమాకు ప్రధాన ఆకర్షణ.

ఈ చిత్రం గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.150 కోట్ల గ్రాస్ మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ చిత్రం వసూళ్లు రూ.141 కోట్లు గా రిజిస్టర్ అయ్యాయి . ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రూ.150 కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉంది.  తాజా సమాచారం ప్రకారం “ఆవేశం” మే 9వ తేదీన ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. కానీ అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

రోషన్ షనవాస్, మిథున్ జై శంకర్, సాజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. జితు మాధవన్ ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు రచయిత , దర్శకుడు. అన్వర్ రషీద్ ఎంటర్ టైన్ మెంట్స్, ఫహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ బ్యానర్స్ .. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. సుశీన్ శ్యామ్ సంగీతాన్ని అందించారు.

Leave a comment

error: Content is protected !!