కన్నడ యంగ్ స్టార్ యశ్, అందాల శ్రీనిధి శెట్టి జంటగా నటించిన సెన్సేషనల్  పాన్ఇండియా మూవీ కేజీయఫ్ . ఈ సినిమా అఖండ విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ .. ఈ సినిమాకి సంబంధించిన రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు.  మొదటి భాగంలాగానే ఈ సినిమాను కూడా పాన్ ఇండియా కేటగిరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో సినిమా పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అయితే లాక్‌డౌన్‌ సమయంలోనే చిత్రానికి సంబంధించిన రీరికార్డింగ్‌ పనులపై దృష్టిసారించారు.

అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేయాగానే 25 నుంచి 30 రోజుల చివరి షెడ్యూల్‌ అనుకుని అందులోనే పోరాట సన్నివేశాలతో పాటు అన్నింటిని ముగించేయాలని, సినిమాను ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేయాలని  చూస్తున్నారట. మొదట వచ్చిన కేజీఎఫ్‌: చాప్టర్‌ ఘనమైన విజయం సాధించి పెట్టింది. అందుకే రాబోయో ఈ సీక్వీల్‌ చిత్రంపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బాలీవుడ్‌కి చెందిన సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌లు నటిస్తున్నారు. రవీనాటాండన్‌ ప్రధానమంత్రి పాత్రలో నటిస్తుంది. ఇంకా ఇందులో రావు రమేష్‌, వశిష్ట సింహా, అచ్యుత్‌ కుమార్‌, మాలవిక అవినాష్‌, టీఎస్‌ నాగభరణ తదితరులు నటిస్తున్నారు. హంబేళే ఫిల్మ్స పతాకంపై నిర్మితమౌతున్న సినిమాకి విజయ్‌ కిరాగండూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

Leave a comment

error: Content is protected !!