ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబో మూవీ ‘కల్కి 2898’ అభిమానుల్లో రోజురోజుకీ ఆత్రుతను పెంచేస్తోంది. ఈ చిత్రంలోని అమితాబ్ బచ్చన్ పాత్రను చిన్న గ్లింప్స్ వీడియోతో ఎలివేట్ చేసి.. భారీ అంచనాలు నెలకొల్పారు మేకర్స్. నిర్మాతలు మొదటి నుంచీ కల్కి 2898 AD ని సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, తాజా గ్లింప్స్ వీడియోలో అమితాబ్ ను అశ్వత్థామ పాత్రలో చూపించారు. కాబట్టి ఈ సినిమాను అరుదైన జోనర్ లో సెంటిఫికన్షన్ అండ్ ఎపిక్ స్టోరీగా మనం చూడొచ్చు.

రీసెంట్ గా ఆహాలో విడుదలైన ‘మై డియర్ దొంగ’ సినిమాకి దర్శకత్వం వహించిన సర్వజ్ఞ కుమార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ‘నేను కల్కి 2898 AD’ కి అదనపు రచయితగా పనిచేశాను. కానీ ఏమీ వెల్లడించలేను కానీ, ఇంతకు ముందు ఎవరూ ప్రయత్నించని ఓ యూనిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుంది” అని ఆయన చెప్పారు.

దీపికా పదుకొణె కథానాయికగా నటించగా, కమల్ హాసన్ ఒక ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించబోతున్నారు. ఈ భారీ చిత్రంలో మరొక బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా ఉన్నారు. ఈ సినిమాను అశ్వనీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Leave a comment

error: Content is protected !!