Shopping Cart 0 items - $0.00 0

వెంకీ ‘కలిసుందాం రా’ చిత్రానికి 20 ఏళ్ళు

 

 

 

విక్టరీ వెంకటేశ్ సినీ కెరీర్ లోనే  మరపురాని కుటుంబ కథా చిత్రం ‘కలిసుందాం రా’. 2000 , జనవరి 14న విడుదలైన ఈ మూవీ నేటికి సరిగ్గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాకి ఉదయశంకర్ దర్శకుడు. అందాల సిమ్రాన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. కె.విశ్వనాథ్, రంగనాథ్, శ్రీహరి, రమా ప్రభ, కల్పనారాయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నిత్యం ప్రేమానురాగాలు  కురిసే  కుటుంబంలో అపార్ధాలు చోటు చేసుకుంటే.. పరిణామం ఎలా ఉంటుంది అనే పాయింట్ చుట్టూ  సాగే ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా టాలీవుడ్ లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి ఆ సంవత్సరం నంది అవార్డే కాకుండా జాతీయ స్థాయిలోనూ అవార్డు రావడం విశేషం. అలాగే ఈ సినిమాలో వెంకీ ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని  కూడా అందుకున్నాడు. యస్.ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో ‘మనసు మనసు కలిసిపోయే , నువ్వే నువ్వే అంటూ నా ప్రాణం’  పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరిస్తాయి.

Leave a comment

error: Content is protected !!