డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగమైన సంగతి తెలిసిందే. డా. మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌, ప్రభాస్‌, బ్రహ్మానందం ఈ ప్రాజెక్ట్‌ లో నటిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ షూటింగ్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే అక్షయ్ కుమార్ ఇటీవలే తన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ సందర్భంగా విష్ణు మంచు తన సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు.

మహాశివరాత్రి రోజున విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ప్రతి అప్‌డేట్‌తో కన్నప్పపై అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ నటీనటులందరూ ఇందులో ఉండడంతో.. అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై పడింది. కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్ కన్నప్ప సెట్స్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ చిత్రీకరణను ముగించాడు. దీనికి సంబంధించి మంచు విష్ణు చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ ప్రయాణం విలువైనది. “మనం తరచుగా ఇలా కలుసుకోగలమని నేను ఆశిస్తున్నాను,” అని మంచు విష్ణు చెప్పాడు.

Leave a comment

error: Content is protected !!