Shopping Cart 0 items - $0.00 0

ఇప్పుడు నేను బాగానే ఉన్నాను

 

టాలీవుడ్  కమెడియన్ అండ్ యాక్టర్  సునీల్ అస్వస్థతకు గురైనట్టు రీసెంట్ గా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. గొంతు ఇన్ఫెక్షన్ తో మాదాపూర్ లోని ఒక హాస్పిటల్ లో చేరాడని.. ఇటీవల కాలంలో యాంటీ బయోటిక్స్ బాగా వాడడం వల్లనే సునీల్ అనారోగ్యానికి గురయ్యడనే సమాచారంతో పాటు.. ఆయన హాస్పిటల్ లో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. తాజాగా ఈ వార్తలపై సునీల్ ట్విట్టర్ ద్వారా స్పందించి.. తన పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు.

మీ ఆశీర్వాద బలంతో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం పట్ల ఎంతగానో ఆందోళన చెందిన అందరికీ కృతజ్ఞతలు. నాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. రేపు విడుదల కాబోతున్న ‘డిస్కోరాజా’ చిత్రం చూసి అందరూ ఎంజాయ్ చేయండి’’ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో టాలీవుడ్ నటీనటులు, సునీల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment

error: Content is protected !!