కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా అతనికి జోడిగా పూజ హెగ్డె నటిస్తుంది. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ఫస్టులుక్, టీజర్ లతో పాటు ‘లాహే లాహే’ అంటూ మణిశర్మ బాణీలను సమకూర్చిన పాట మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలని మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాని మే 13న విడుదల చేస్తామని ప్రకటించింది మూవీ యూనిట్.

 ప్రస్తుతం ఇరు తెలుగు రాష్టాలలో నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ గట్టిగా ఉండటం వలన థియేటర్స్ కి ప్రేక్షకులు వచ్చి సినిమా చూసే పరిస్థితులు లేవు. కావున సినిమా విడుదల తేదీని వాయిదా వేసి త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు మూవీ టీమ్. మెగాఫ్యాన్స్ కు ఇది నిరాశ కలిగించే వార్తే అయినా కూడా కరోనా ఎఫెక్ట్ రోజుల్లో సినిమా వాయిదా వేయడం మంచి నిర్ణయమని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

Leave a comment

error: Content is protected !!