Shopping Cart 0 items - $0.00 0

ప్రభాస్ మూవీతో ప్రేమ పావురం రీఎంట్రీ.. ?

‘మైనే ప్యార్ కియా’ మూవీతో భారతీయ ప్రేక్షకుల్ని  తన అందంతో పడేసింది అందాల భాగ్యశ్రీ . కబూతర్ జా.. జా.. జా అంటూ.. యువత గుండెల్లో గుబులు రేపింది. అదే సినిమాతో సల్లూ భాయ్ బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ప్రేమ పావురాలు’ గా ఈ సినిమా తెలుగులోనూ సంచలనం రేపింది. అయితే ఆ మూవీ అంత హిట్టయినా.. భాగ్యశ్రీ బాలీవుడ్ లో అంతగా నిలదొక్కుకోలేకపోయింది. అమ్మడు తెలుగులో ‘ఓంకారం, యువరత్న రాణా’ లాంటి సినిమాల్లో మాత్రమే కనిపించింది. అయితే ఇన్నాళ్లకు ఆ ప్రేమపావురం  మళ్లీ తెలుగు తెరమీద ఒక ఆసక్తికరమైన పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వనుందనే సమాచారం ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది.

ప్రభాస్ 20వ సినిమాగా జిల్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రస్తుతం ‘జాన్’ (వర్కింగ్ టైటిల్ ) మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగ్యశ్రీ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోందట. అంతేకాదు.. ఆమెకు ,ప్రభాస్ కు సంబంధించిన కొన్ని సీన్స్ హైద్రాబాద్ షెడ్యూల్ లో ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటున్నాయట. తెలుగు,తమిళ, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమా కు భాగ్యశ్రీ ప్రెజెన్స్ ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ కానుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!