Shopping Cart 0 items - $0.00 0

రీచార్జ్ అవుతోన్న అల్లరోడు

 

కొంతకాలంగా కామెడీ హీరో గా సరైన సక్సెసే దక్కని అల్లరి నరేశ్ లాస్ట్ ఇయర్ .. మహేశ్ బాబు ‘మహర్షి’ లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఘన విజయంతో ఇకపై అతగాడికి అన్నీ అలాంటి రోల్సే వస్తాయేమోనని నిన్న మొన్నటి వరకూ జనానికి కాస్తంత కన్ఫ్యూజన్ ఉండేది. అయితే అలాంటిదేమీ లేదని త్వరలోనే తను మళ్ళీ హీరోగా రీచార్జ్ అవబోతున్నానని నరేశ్ ఒక అప్డేట్ తో అందరికీ సమాధానం చెప్పాడు. యస్ వి  2 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్నఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాడు. ఆ బ్యానర్ పై సతీశ్ మొట్టమొదటగా నిర్మించబోయే మూవీ అల్లరి నరేశ్ తోనే కావడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అల్లరి నరేశ్ కామెడీ హీరోగా మంచి జోరుమీదుండే టైమ్ లో అతడితో ‘దొంగల బండి’ అనే మూవీని డైరెక్ట్ చేసి హిట్టు కొట్టిన సతీశ్ వేగేశ్న ఇప్పుడు అదే అల్లరోడితో .. ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడు. విజయ్ కనకమేడల అనే కొత్త కుర్రోడి దర్శకత్వంలో ఈ సినిమా ఈ నెల 20న రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంఛ్ కానుంది.  నరేశ్ రెగ్యులర్ గా చేసే కామెడీ మూవీగా కాకుండా.. అతడిలోని బెస్ట్ పెర్ఫార్మర్ ను వెలికి తీసే సినిమా అవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. అల్లరోడి 57వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఇన్విటేషన్ ను అతడి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడం విశేషం. మరి ఈ సినిమాతో అల్లరి నరేశ్ నిజంగానే రీచార్జ్ అవుతాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!