Shopping Cart 0 items - $0.00 0

ప్రాణం పోసుకున్న రవివర్మ చిత్రాలు

భారతీయ చిత్రకళలో దేశ విదేశాల్లోనూ ఖ్యాతి గాంచిన ప్రముఖ చిత్రకారుడు రవివర్మ . ఆయన కుంచె నుంచి కేన్వాస్ మీద ప్రాణం పోసుకున్న ఎన్నో చిత్రాలను గురించి మనకు బాగా తెలుసు. అయితే నేటి మేటి దక్షిణాది కథానాయికలు ప్రముఖ ఫోటో గ్రాఫర్ జీ. వెంకట్రామ్ కెమేరాలో రవివర్మ చిత్రాలు గా బందీ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రముఖ నటీమణి  సుహాసినీ మణిరత్నం స్థాపించిన నామ్ చారిటబుల్ ట్రస్ట్ కోసమే వీరంతా రవివర్మ గీచిన అందాల బొమ్మలు గా  మారిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

తల్లికాబోతోన్న అమ్మాయిగా సమంతా అక్కినేని

ఒక చేతిలో పండు పట్టుకుని మరో చేతితో చీర కొంగును సరిచేసుకుంటున్నట్టు ఉన్న తన ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నా కడుపున ఒక కాయకాయబోతోంది అని సింబాలిక్ గా చెప్పే ఆ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కురుపాం రాణిగా శృతిహాసన్

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ శృతిహాసన్ రెండు రవివర్మ చిత్రాలకు ప్రాణం పోసింది. ఒకటి నది ఒడ్డున కూర్చున్న అమ్మాయి చిత్రం కాగా.. రెండోది కురుపాం రాణి పెయింటింగ్. ఈ ఫొటోలను శృతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 ఊదారంగు చీరలో శృతి

 కురుపాం రాణి గెటప్‌లో ఎంతో అందంగా కనిపించిన శృతిహాసన్.. ఊదారంగు చీరలో నది ఒడ్డున కూర్చున్న మహిళగానూ అంతే అందంగా కనిపించింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ హీరోయిన్.. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు సుహాసినికి థ్యాంక్స్ చెప్పింది.

పుదుక్కోట్టై  రాణిగా ఐశ్వర్య రాజేష్

కౌశల్య కృష్ణమూర్తిసినిమాతో మెప్పించిన తమిళ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ కూడా రవివర్మ బొమ్మకు ప్రాణం పోసింది. వెంకట్ రామ్ క్యాలెండర్ షూట్‌లో పాల్గొన్న ఈ 29 ఏళ్ల నటి పుదుకోట్టై  రాణిగా చాలా అందంగా కనిపించింది. ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది..

రాణి చిమ్నాబాయిగా మంచు లక్ష్మి

రాణి చిమ్నాబాయిగా మంచు లక్ష్మి భలేగా కుదిరింది. ముదురు ఊదా రంగు చీరలో ఠీవిగా చూస్తూ మెరిసిపోయింది.

దమయంతిగా మారిన రమ్యకృష్ణ

బాహుబలిలో రాజమాత శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ.. ఇప్పుడు రవివర్మ గీసిన విదర్భ యువరాణి దమయంతి చిత్రానికి ప్రాణం పోసింది. 

 మరాఠి మహిళగా ఖుష్బూ

 తమిళ సీనియర్ నటి ఖుష్బూ.. రవివర్మ గీసిన మరాఠి మహిళ చిత్రానికి ప్రాణం పోసింది. రవివర్మ గీసిన మహిళ చిత్రంలోని పండ్లు, ఆమె ఆభరణాలు మినహాయిస్తే అచ్చం ఆ మహిళ మాదిరిగానే ఉంది ఖుష్బూ. 

 

చంటిబిడ్డనెత్తుకున్న మలయాళ మహిళ గా శోభన 

ఒకప్పటి అందాల మలయాళ తార శోభన రవివర్మ గీచిన చిత్రానికి సరిగ్గాసరిపోయింది.  చేతిలో బిడ్డ, పక్కనే పెంపుడు కుక్కతో రివీలయిన శోభన రవివర్మ చిత్రానికి ప్రాణం పోసింది. 

అలాగే అలనాటి మలయాళ కథానాయికలు లిజి, నదియా సైతం రవివర్మ చిత్రాలు గా మారిపోయి నెటిజెన్స్ ను ఆశ్చర్యపరిచారు. 

 

Leave a comment

error: Content is protected !!