సినిమా ఆయనకు ఆత్మ. సినిమా నిర్మాణం ఆయనకు దైవంతో సమానం. నిర్మాతల్లో రారాజు ఆయన.  సౌత్ లో దాదాపు  అన్ని భాషల్లోనూ శతాధిక సంఖ్యలో  వైవిధ్యమైన చిత్రాల్ని నిర్మించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఆ మహా నిర్మాత  పేరు దగ్గుబాటి రామానాయుడు. ఎంతో మంది దర్శకుల్ని, ఎందరో కళాకారుల్ని తెలుగు తెరకు పరిచయం చేసి.. తన ఘనతను చాటుకున్న ఆయనకు మూవీ మొఘల్ అనే బిరుదునిచ్చి తెలుగు ప్రేక్షకులు గౌరవించుకున్నారు.

ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు రామానాయుడు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క,  చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగారు.   కారంచేడులో ‘నమ్మిన బంటు’ షూటింగ్ లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించారు, హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించారు. తిరిగి వెళ్తునప్పుడు ‘మీరు సినిమాల్లోకి ఎందుకు కాకూడదు?’ అని అక్కినేని అడికితే, వూరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బధులు ఇచ్చారు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టారు, ఓ రోజు హఠాత్తుగా సేల్స్-టాక్సవాళ్ళు వచ్చి, బిల్లులు రాయడములేదంటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు ముసివేషి, వూరు విడచి చెన్నపట్నం చేరుకున్నారు రామానాయుడు . మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నారు, కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్ళేవారు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. ‘అనురాగం’ చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురుపెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి, దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చాడు.జి.రామినీడు దర్శకత్వంలో ‘అనురాగం’ అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు.

తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘రాముడు-భీముడు’ చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావులతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు.   సినీ నిర్మాణ రంగంలో అడుగు ముందుకే వేశారు. అయితే ఆ తర్వాత విపరీతంగా నష్టాల పాలైన ఆయన 1971లో ‘ప్రేమ్‌నగర్’ చిత్రాన్ని నిర్మించారు.’ప్రేమనగర్’ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 21 మంది కొత్త దర్శకుల్ని, ఆరుగురు హీరోలను పరిచయం చేశారు. 2010 లో రామానాయుడుకి కేంద్రప్రభుత్వం దాదా సాహెబ్ పాల్కే అవార్డునిచ్చి సత్కరించింది. నేడు రామానాయుడు వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మూవీ మొఘల్ కు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!