Shopping Cart 0 items - $0.00 0

మరల.. వైకుంఠపురములో …?

 

2020 సంక్రాంతి సీజన్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకొని టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం. ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఈ మూవీ హావా ఇంకా తగ్గలేదు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ తో ఖాతా తెరిచిన బన్నీ, త్రివిక్రమ్ లు మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసే ప్రయత్నంలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా సాధించిన ట్రెమెండస్ సక్సెస్ ను దృష్టిలో పెట్టుకొని దీనికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట హారిక అండ్ హాసిని సంస్థవారు. ఆ మేరకు త్రివిక్రమ్ తో చర్చలు కూడా జరిపారట.

ప్రస్తుతం బన్నీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గంధపుచెక్కల మాఫియా నేపథ్యంలో అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ మూవీని .. మరో ‘రంగస్థలం’ లా  తీర్చిదిద్దాలని సుక్కూ భావిస్తున్నాడట. ఈ సినిమా కంప్లీట్ అయ్యే టైమ్ కు ‘అల వైకుంఠపురములో 2’ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకొని ఆ వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారట. మరి ‘అల… వైకుంఠపురములో’ సీక్వెల్  కోసం త్రివిక్రమ్ ఏ స్థాయిలో కథను రెడీ చేస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!