ప్రముఖ తెలుగు రియాల్టీషో బిగ్ బాస్ ఇప్పుడు 4వ సీజన్ లోకి అడుగుపెట్టింది. కోవిడ్ 19 వల్ల షో కాస్తంత లేటుగా ప్రారంభమైనా.. ప్రత్యేక ఆకర్షణలతో గత మూడు సీజన్స్ కన్నా భిన్నంగా పార్టిసిపెంట్స్  హౌస్ లోకి ఎంటరయ్యారు. ఈరోజు సాయంత్రం 6గంటలకు మొదలైన ఈ షో లో నాగ్ ముసలి పాత్ర కూడా ఆ షోలో భాగమై నవ్వులు పూయించింది. అయితే ఈ షోకు యూ ట్యూబ్ విలేజ్ షో సెలబ్రిటీ గంగవ్వ ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.  ఆ వయసులో కూడా ఎంతో చెలాకీగా .. నాగార్జునతో తనదైన శైలిలో సంభాషించి కామెడీ పండించింది.  

అందరికన్నా ముందుగా హౌస్ లోకి బ్రదరాఫ్ బొమ్మాళి హీరోయిన్ మోనాల్ గుజ్జార్ ఎంటరైంది. ఆ తర్వాత దర్శకుడు సూర్యకిరణ్, లాస్య, అభిజిత్, మెహబూబా దిల్ సే, కరాటే కళ్యాణి, నోయల్, దివి, సోహెల్, దేవీ నాగవల్లి, దిల్ దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేత్తడి హారిక, అరియానా గ్లోరీ, అఖిల్ సార్ధక్, గంగవ్వ వరుసగా ప్రవేశించారు. ఇక వీరిలో సోహెల్ ను,అరియానా గ్లోరీని సీక్రెట్ రూమ్ లో ఉంచారు. 15 వారాలపాటు జరిగే ఈ షో కోసం వివిధ రకాల టాస్కులను సిద్ధం చేశారు. ఇక వీరిలో అందరికీ కోవిడ్ నెగెటివ్ వచ్చిందని, తనకు కూడా కోవిడ్ నెగెటివ్ వచ్చిన తర్వాతే ఈ షోలోకి ప్రవేశించినట్టు నాగార్జున తెలిపారు. మరి ఈ షో గత మూడు సీజన్ల కన్నా మిన్నగా రక్తికట్టిస్తుందేమో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!