Shopping Cart 0 items - $0.00 0

కొత్తదనానికి ‘నాంది’ పలికిన అల్లరి నరేశ్

 

టాలీవుడ్ లోఎప్పటినుంచో సరైన హిట్టు కోసం ఎదురు చూస్తోన్న హీరోల్లో అల్లరి నరేశ్ ఒకడు. ఎప్పుడో ‘సుడిగాడు’ అనే మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన నరేశ్ కు ఆ తర్వాత నుంచి అదృష్టం ముఖం చాటేసింది. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిర్మాతలకు ఒక భరోసా గా నిలిచిన అల్లరోడు .. ఇప్పుడు విజయాలకోసం దిక్కులు చూసే పరిస్థితి ఎదురైంది. తనకు బాగా అలవాటైన , చెయితిరిగిన  కామెడీ జోనర్ లోనే అతగాడు హిట్టు కొట్టలేకపోతున్న పరిస్థితి.  అందుకే నరేశ్ ఇప్పుడు రూట్ మార్చాడు.

ఇప్పటి ప్రేక్షకులు బాగా ఇష్టపడే థ్రిల్లర్ జోనర్ కు షిఫ్టయ్యాడు. ఈ రోజే మొదలైన ఒక మూవీనే దానికి నిదర్శనం. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్న యస్.వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి తొలి ప్రొడక్షన్ గా.. విజయ్ కనకమేడల అనే నూతన దర్శకుడ్ని పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. దానికి ‘నాంది’ అనే ఒక ఇంటెన్స్ టైటిల్ పెట్టాడు. గొలుసులతో తల్లకిందులుగా వేలాడుతోన్న అల్లరి నరేశ్ పోస్టర్ తో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో నరేశ్ చాలా డిఫెరెంట్ గా కనిపిస్తున్నాడు. గతంలో ‘గమ్యం, నేను, శంభో శివశంభో, మహర్షి’  లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్న అతడు .. ‘నాంది’లో కూడా కలకాలం గుర్తుండిపోయే పాత్ర పోషించనున్నట్టు అనిపిస్తోంది. మొత్తం మీద అతగాడు ఈ సినిమాతో కొత్తదనానికి నాంది పలికాడని చెప్పుకోవచ్చు.

Leave a comment

error: Content is protected !!