Shopping Cart 0 items - $0.00 0

ఏప్రిల్ 3న రాజ్ తరుణ్ ‘ఓరేయ్ బుజ్జిగా…’

 

 

 

 

ఒకప్పుడు టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ కొంతకాలంగా.. సరైన విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. ఎర్లియర్ గా అతడు నటించిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా ఎప్పుడొచ్చిందో,  ఎప్పుడెళ్ళిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది.  వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న అతడి కెరీర్ ను  ఇప్పుడో బ్రహ్మాండమైన హిట్టు గాడిలో పెట్టాలి. ఆ ప్రయత్నంలోనే అతగాడు ‘గుండెజారి గల్లంతైందే’ ఫేమ్ కొండా విజయ్ కుమార్ తో ఒక మూవీ చేస్తున్నాడు. ‘ఓరేయ్ బుజ్జిగా’ అనే క్యాచీ టైటిల్ తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ‘కళ్యాణ వైభోగమే’ ఫేమ్ మాళవికా నాయర్ కథానాయికగా నటిస్తోంది.

చైతూ తో ‘ఒక లైలా కోసం’ మూవీ చేసిన తర్వాత కొండా విజయ్ కుమార్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కాస్తంత గ్యాప్ ఇచ్చాడు. ఒక విధంగా అతడికి ఈ సినిమా రీ ఎంట్రీ లాంటిదే. అందుకే ఈ మూవీ దర్శకుడిగా తనకి, హీరోగా రాజ్ తరుణ్ కు సరైన బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు. హెబ్బా పటేల్ , వాణీ విశ్వనాథ్, నరేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కాబోతోంది. కెకె రాధా మోహన్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఒరేయ్ బుజ్జిగా మూవీతో .. రాజ్ తరుణ్  బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!