Shopping Cart 0 items - $0.00 0

‘ఉప్పెన’ హీరోపై కన్నేసింది

సుప్రీమ్ హీరో సాయిధర్మతేజ తమ్ముడు వైష్ణవ్ తేజ.. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ  ఇంకా విడుదల కాకుండానే,  వైష్ణవ్ తేజకు అప్పుడే  రెండో  సినిమా ఓకే అయిందని సమాచారం.  

ఇటీవల ‘ఓ.. బేబీ’ మూవీతో మంచి సక్సెస్ సాధించిన నందినిరెడ్డి.. వైష్ణవ్ తేజ కోసం ఒక యూత్ ఫుల్ స్టోరీ రెడీ చేసిందట. ‘అలా మొదలైంది, జబర్దస్త్, కళ్యాణ వైభోగమే, ఓ.. బేబీ’ లాంటి కామెడీ ఎంటర్ టైనర్స్  తో టాలీవుడ్ లో మంచి దర్శకురాలిగా పేరు సంపాదించుకున్న నందినీ రెడ్డి.. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వారి ‘లవ్ స్టోరీస్’ వెబ్ సిరీస్ కు కమిట్ అయింది. ఇది కంప్లీట్ కాగానే మెగా హీరో సినిమా కోసం రంగంలోకి దిగుతుందట. ‘ఉప్పెన’ రిజల్ట్ తో సంబంధం లేకుండానే వైష్ణవ్ తేజ నందిని రెడ్డి సినిమాకు కమిట్ అవుతుండడం ఆసక్తిని రేపుతోంది. అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంకా దత్ నిర్మించనున్న ఈ మూవీ వైష్ణవ్ తేజకు ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!