Shopping Cart 0 items - $0.00 0

ఈ ఇద్దరూ టాలీవుడ్లో బిజీ అవుతారా?

 

బన్నీ, త్రివిక్రమ్ కలయికలో  ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై  వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ స్టైలాఫ్ టేకింగ్ కు , బన్నీ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తోడై.. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తోంది. అలాంటి  ఈ మూవీకి  మాలీవుడ్ విలక్షణ నటుడు జయరామ్, బాలీవుడ్ గ్లామర్ క్వీన్ టబు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. బన్నీ ఒరిజినల్ పేరెంట్స్ గా .. ఓ రేంజ్ లో ఎమోషన్స్ పండించిన ఈ జోడీకి  ..  సినిమా ఘనవిజయం ఓ రేంజ్ లో ఫెచ్ కానుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో ‘తెనాలి, పంచతంత్రం, తుపాకీ లాంటి పలు తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు వారికీ సుపరిచితుడైన జయరామ్.. అనుష్క ‘భాగమతి’ డైరెక్ట్ తెలుగు చిత్రంతో విలన్ గా నటించి.. ప్రేక్షకుల ఆదారాభిమానాల్ని అందుకున్నాడు. తాజాగా ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని తన విలక్షణ నటనతో  తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. అందుకే ఈ సినిమా తర్వాత ఆయన మరిన్ని అవకాశాలు అందుకొనే ఛాన్సెస్ ఉన్నాయని టాలీవుడ్ జనం చర్చించుకుంటున్నారు. అలాగే..  పుష్కరకాలం క్రితం బాలయ్య ‘పాండురంగడు’ చిత్రంలో చివరిసారిగా టాలీవుడ్ లో నటించిన అందాల టబు.. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో  రీ ఎంట్రీ ఇచ్చి .. ఓ రేంజ్ లో మెప్పించింది . ఈ సినిమా సూపర్ సక్సెస్ తో అమ్మడు కూడా తెలుగులో వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి కానుందని చెప్పుకుంటున్నారు. మరి బన్నీ పేరెంట్స్ నిజంగానే తెలుగులో బిజీ అవుతారేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!