తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులను పేద కళాకారులకు “మనం సైతం” ఫౌండేషన్ తరపున చేయూతను అందిస్తున్నారు. ఇండస్ట్రీలో రోజువారీ కూలి పనిచేసే కార్మికులను దృష్టిలో పెట్టుకొని మెల్లగా సెలబ్రిటీలు విరాళాలు ఇవ్వడానికి కదిలి వస్తున్నారు. తాజాగా ‘మనం సైతం’ ఫౌండేషన్ కు 5లక్షల విరాళాన్ని అందించాడు డైరెక్టర్ వివి వినాయక్. నటుడు కాదంబరి కిరణ్ కుమార్ ఈ ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నాడు.

ఈ విధంగా అందించిన విరాళాన్ని.. పేద కార్మికులు కళాకారులు మనం సైతంను సంప్రదించి సహాయాన్ని పొందవచ్చని డైరెక్టర్ వివి వినాయక్ వీడియో రూపంలో తెలియజేసాడు.  కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా  నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బంది పడుతున్న పేదవారికోసం తన వంతుగా 5లక్షలు అందించానని పేద కళాకారుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ ను అభినందించడం జరిగింది.

Leave a comment

error: Content is protected !!