Zee 5 : మలయాళ చిత్రసీమలో కొత్త శకానికి నాంది పలికే సరికొత్త వెబ్ సిరీస్ ‘మనోరథంగల్’ ను భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించింది. ఈ అద్భుతమైన వెబ్ సిరీస్ ఆగస్టు 15న ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది.
సాహితీ దిగ్గజం మాదత్ తెక్కెపాట్టు వాసుదేవన్ నాయర్ అనే యమ్టీ 90వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ వెబ్ సిరీస్ రూపొందించబడింది.

వాసుదేవన్ నాయర్ రచించిన తొమ్మిది కథల సంకలనమే ఈ వెబ్ సిరీస్. ఈ తొమ్మిది కథలకూ ఓ కనెక్షన్ ఉంటుంది. 9 మంది సూపర్ స్టార్‌లు, 8 మంది లెజెండరీ దర్శకులతో ఈ వెబ్ సిరీస్ ZEE5 లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్, జరీనా, బిజు మీనన్, కైలాష్, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, సురభి లక్ష్మి, ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ, పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్, మధు, ఆసిఫ్ అలీ వంటి వారు ఈ తొమ్మిది కథల్లో నటించారు.

వీటికి ప్రియదర్శన్, రంజిత్, శ్యామప్రసాద్, జయరాజన్ నాయర్, సంతోష్ శివన్, రతీష్ అంబట్, అశ్వతి నాయర్ వంటి వారు దర్శకత్వం వహించారు. ‘మనోరథంగల్’ వెబ్ సిరీస్ మలయాళ చిత్రసీమలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!