Vyjayanthi MOvies : తెలుగు సినీ పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ యాభై ఏళ్ల వార్షికోత్సవం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా మెగా అభిమానులకు ఒక గొప్ప బహుమతిని వ్వాలను కుంటున్నారు వైజయంతి వారు. 2002లో విడుదలై తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ‘ఇంద్ర’ సినిమా ఆగస్టు 22న మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే కథానాయికలుగా నటించారు.

2002, జూలై 24న విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా ఈ సినిమా నిలిచింది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా నంది మరియు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు లభించడంతో పాటు, మొత్తం మూడు నంది మరియు రెండు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలను ఈ సినిమా అందుకుంది. 22 ఏళ్ల తర్వాత మళ్ళీ తెరపై ఆవిష్కృతం కాబోతున్న ఈ సినిమా చిరంజీవి అభిమానులకు మాత్రమే కాకుండా, తెలుగు సినీ ప్రేమికులందరికీ పండగే.

Leave a comment

error: Content is protected !!