Vishwaksen :  జాతి రత్నాలు లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అనుదీప్, కెవి శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్‌ తెరకెక్కించాడు. ఆ చిత్రం యావరేజ్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంక దీని తర్వాత ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రవితేజతో చర్చలు జరిపాడు కానీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ చిత్రం కోసం అనుదీప్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చర్చలు జరుపుతున్నాడు.

తాజా సమాచారం ప్రకారం అనుదీప్ విశ్వక్ సేన్‌ కు మంచి కథ చెప్పి అతడ్ని ఇంప్రెస్ చేశాడని సమాచారం. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి అనుమతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. త్వర‌లోనే అధికారిక ప్రకట‌న వెలువ‌డి వ‌చ్చే ఏడాది షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభం కానుంది.

రవితేజకు వివరించిన స్క్రిప్ట్‌లో అనుదీప్ మార్పులు చేశారా లేదా విశ్వక్ సేన్ కోసం పూర్తిగా కొత్తదాన్ని రాశారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడానికి అనుదీప్ కూడా చర్చలు జరపడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ చిత్రీకరణను దాదాపు పూర్తి చేసాడు . అతను లేటెస్ట్ గా లైలా చిత్రీకరణను ప్రారంభించాడు. మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.

Leave a comment

error: Content is protected !!