రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి  చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. రానా అరణ్య గా చేస్తున్నారు. తనను తన కవిత్వాన్ని ఇష్టపడే పాత్రలో సాయి పల్లవి నటించింది. అతని కవిత్వానికి ప్రేరణ చెంది తనను కలుసుకోవడానికి అడవులోకి వెళ్ళిన గ్రామీణ యువతి పాత్రలో సాయి పల్లవి నటించింది. అలా వెళ్ళిన తనకు ఎదురైనా పరిస్థితులను టీజర్ లో చూపించారు. ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్, నవీన్‌ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి డి. సురేశ్‌బాబు సమర్పకుడి వ్యవహరిస్తున్నాడు.

 

Leave a comment

error: Content is protected !!