Shopping Cart 0 items - $0.00 0

విక్రమ్

 

అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి చిత్రం ‘విక్రమ్’. 1986, మే 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కథానాయికగా శోభన కు కూడా ఇదే మొదటి తెలుగు చిత్రం. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘హీరో’ కి రీమేక్ అవడం విశేషం. జాకీ ష్రాఫ్ హీరో గా నటించిన ఈ సినిమాకి దర్శకుడు సుభాష్ ఘాయ్ . మీనాక్షి శేషాద్రి కథానాయికగా నటించిన ఈ సినిమా అప్పట్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఇదే చిత్రం కన్నడలో రవిచంద్రన్ హీరోగా రణధీరగా విడుదలై.. అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఒక పోలీసాఫీసర్ మీద కక్ష సాధింపు చర్యగా అతడి కూతురిని కిడ్నాప్ చేసిన హీరో.. చివరికి ఆమె ప్రేమలోనే పడే ఓ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా నాగార్జున ను టాలీవుడ్ లో హీరోగా నిలబెట్టింది.

Leave a comment

error: Content is protected !!