Vijay Sethupathi : తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి తన గత చిత్రం ‘మహారాజా’ తో సౌత్ ఆడియన్స్ ను బాగా మెప్పించారు. ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్ళు సాధించింది. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘గాంధీ టాక్స్’. ఈ చిత్రం సత్యం, శాంతి, ప్రేమ, అహింస అనే విలువలను కేంద్రంగా చేసుకుని, మూకీ చిత్రంగా రూపొందుతోంది.

ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన మహదేవ్ అనే యువకుడు, వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న బోస్‌మన్‌తో స్నేహం చేస్తాడు. ఈ స్నేహం మహదేవ్ జీవితంలో కొత్త మలుపు తీసుకురావడానికి దారితీస్తుంది. మహదేవ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని తన జీవితాన్ని మార్చుకున్నాడనేది ఈ చిత్రం వివరిస్తుంది.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి కిశోర్ పాండురంగ బేలేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గతేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. గాంధీ జయంతి సందర్భంగా చిత్రబృందం సామాజిక మాధ్యమాల్లో చిత్రీకరణకు సంబంధించిన వీడియోను పంచుకుంది.

Leave a comment

error: Content is protected !!