Vijay Devarakonda : ‘కల్కి 2898 ఎ.డి’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇటీవల వైజాగ్‌లో ఓ ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం, ఇప్పుడు శ్రీలంకలో మరో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. దాదాపు 40 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండపై భారీ యాక్షన్ సన్నివేశాలతో  పాటు, మిగతా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించబడతాయి. ఆగస్టు చివరి నాటికి చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. స్పై థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Leave a comment

error: Content is protected !!