లాస్ట్ ఇయర్ ‘ఎఫ్ 2’ చిత్రంతో విక్టరీ వెంకటేష్ , ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో డైనమిక్ డైరెక్టర్  పూరీ జగన్నాథ్ మంచి ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం వెంకీ తమిళ ‘అసురన్’ కోసం ‘నారప్ప’ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్ ) అనే మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దీని తర్వాత పూరీ .. మహేశ్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే  మహేశ్ కు బోలెడన్ని కమిట్ మెంట్స్ ఉండడంతో ..  ఆ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చెప్పలేని పరిస్థితి. కానీ త్వరలోనే వెంకీ హీరోగా పూరీ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.

గతంలో వెంకటేశ్, పూరీ జగన్నాథ్ కాంబో లో ఒక సినిమా రాబోతోందనే న్యూస్ స్ర్పెడ్ అయింది కానీ.. అప్పట్లో అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు వీరిద్దరి  మూవీ గురించి మరోసారి వార్తలు వస్తున్నాయి. గత రెండున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో పూరి జగన్నాధ్ కథలు వండే పనిలో పడ్డాడట. ఈ సమయంలోనే ఒక కథను వెంకటేష్ కు వినిపించగా ఆయన ఓకే అన్నాడని.. ఆ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరికి ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి అయిన తర్వాత వీరి కాంబో మూవీ ఉంటుందని అంటున్నారు. పూర్తి వివరాలు అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారట మేకర్స్.

 

 

Leave a comment

error: Content is protected !!