సామాజికం అంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ కలయికలో వచ్చిన ‘కంచె’ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. త్వరలోనే వీరి కలయికలో మరో సినిమా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. అయితే ఈసారి క్రిష్ కేవలం నిర్మాతగానే వ్యవహరించనుండడం విశేషం. ప్రస్తుతం వరుణ్ తేజ బాక్సింగ్ నేపథ్యంలో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నాడు. ఆపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చేయడానికి రెడీ అవుతాడు. ఈ రెండు చిత్రాలూ పూర్తయిన తర్వాత క్రిష్ నిర్మాణంలోని చిత్రంలో వరుణ్ నటించనున్నాడు.

ఇక ఈ సినిమాకి సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌ పనుల్లోనే వక్కంతం వంశీ, సురేందర్‌ బిజీగా ఉన్నట్లు సమాచారం ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్‌ చిత్రంతో క్రిష్‌ బిజీగా ఉన్న కారణంతోనే ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను సురేందర్‌ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్ర కథేంటి? నటీనటులెవరు? ఎప్పటి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది? వంటి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

 

Leave a comment

error: Content is protected !!