వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ .. ఫ్రీ పబ్లిసిటీకి అసలైన చిరునామా రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్ చిత్రాల రూపురేఖల్ని తన డెబ్యూ మూవీతో మార్చిపడేసిన ఆ మేకింగ్ జీనియస్ .. కొంతకాలంగా… వివాదాలతోనే పబ్బం గుడుపుతూ.. తన స్థాయిని  తగ్గించుకుంటూ.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయినా సరే ఆయన యాటిట్యూడ్ ని, ఆయన సిద్ధాంతాల్ని అభిమానించే ఒక వర్గం ప్రేక్షకులు ఉన్నారు. ప్రత్యేకించి ఈ లాక్ డౌన్ టైమ్ లో కూడా క్లైమాక్స్ , నేకెడ్ లాంటి సినిమాల్ని ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో విడుదల చేసి .. దానికి తగ్గ కలెక్షన్స్ రాబట్టారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని బేస్ చేసుకొని పవర్ స్టార్ అనే మరో సినిమాను ఈ నెల 24న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

అసలు మేటర్ కొస్తే..  వర్మ ఇప్పుడు మరో ఆసక్తి కరమైన సంఘటనను సినిమాగా మలిచే ప్రయత్నంలో ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, నిర్మాత బెల్లంకొండ సురేశ్ మధ్య గతంలో జరిగిన ఫైరింగ్ ఇన్సిడెంట్ ను సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ‘ఆ రోజు రాత్రి ఏంజరిగింది’ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై బాలయ్య కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆసలు ఆయన బెల్లంకొండపై ఆ కాల్పులు జరపడానికి దారితీసిన పరిస్థితులపై ..వర్మ రీసెర్చ్ చేసి మరీ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.  మరి బాలకృష్ణ ఫ్యాన్స్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!