దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అతిధులుగా హాజరైన ఈ టీజర్ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది.
నటులు, నట జీవితం అంటే నాకు ఒక ఎమోషనల్ ఎటాచ్మెంట్. ఆర్ట్ ఈజ్ లాంగ్.. లైఫ్ ఈజ్ షార్ట్. చివరి వరకూ మిగిలిపోయేది కళ మాత్రమే. కళా కారులందరినీ ఒక్క చోటికి చేర్చి వీరిపై ఒక సినిమా చేయాలని ఆలోచన చేసిన దర్శకుడు అర్జున్ సాయికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే ధైర్యంతో పాటు సినిమాటిక్ గా చెప్పే నేర్పు కావాలి. ఇంతమంది నటీనటులని ఒక్క చోటికి చేర్చి చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు. నిజంగా ఈ సినిమా ‘ఉత్సవం’లా వుంటుంది. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్నారు స్టార్‌ కమెడియన్ బ్రహ్మానందం.

Leave a comment

error: Content is protected !!