Pekamedalu : క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన “పేక మేడలు” సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాకేష్ వర్రే నిర్మాతగా, నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటించిన ఈ చిత్రం ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది.

ఇటీవల వైజాగ్ మరియు విజయవాడలో నిర్వహించిన స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉందని, ప్రతి ఒక్కరూ సినిమా చూసే విధంగా టికెట్ ధరలు ₹100 గా నిర్ణయించడం మరో విశేషం. తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని విడుదల చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!