Vishwam : శ్రీను వైట్ల సినిమాల్లో కామెడీ ఏ మోతాదులో ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా ‘వెంకీ’ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం ‘విశ్వం’లో మరోసారి ట్రైన్ ఎపిసోడ్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘విశ్వం’ సినిమాలో ఈ ట్రైన్ ఎపిసోడ్‌ను చాలా హైలైట్‌గా చిత్రీకరించారని టాక్. ఈసారి ‘వెంకీ’ని మించిపోయేలా ఈ ఎపిసోడ్‌ను రూపొందించారని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లింప్స్ కూడా చూపించారు. అవి చూస్తుంటే శ్రీను వైట్ల మరోసారి ‘వెంకీ’ మ్యాజిక్‌ను రిపీట్ చేసినట్లే అనిపిస్తోంది.

ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ జరిపిన ఈ సినిమాలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారు. శ్రీను వైట్లతో పాటు గోపీచంద్‌కు కూడా ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా అవసరం. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!