టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్  హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి తదుపరి చిత్రాలకోసం ఆల్రెడీ స్ర్కిప్స్ట్ రాసుకొని రెడీ గా ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా  ఆ ముగ్గురు దర్శకుల ప్లాన్స్ అన్నీ అప్ సెట్ అయ్యాయి. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గితేనే కానీ.. ఆయా  సినిమాల షూటింగ్స్  ప్రారంభించడం కుదరదు. దాంతో ఈ ముగ్గురు యువ దర్శకులూ.. కొత్త మార్గాన్ని ఎంచుకోబోతున్నట్టు సమాచారం.

హ‌రీష్ శంక‌ర్..  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో  చేయనున్న సినిమా క‌రోనా కార‌ణంగా వ‌చ్చే ఏడాది స్టార్టయ్యే అవ‌కాశం వుండ‌టంతో హ‌రీష్ శంక‌ర్ ఆలోపు వెబ్ సిరీస్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అలాగే అనిల్ రావిపూడి `ఎఫ్‌2` సీక్వెల్‌ ప్లాన్ కూడా  క‌రోనా కార‌ణంగా తారుమారైంది. దీంతో త‌ను కూడా వెబ్ సిరీస్ చేయాల‌ని ప్లాన్‌లు చేసుకుంటున్నాడ‌ట‌. కోటిన్నర బ‌డ్జెట్‌తో 20 నుంచి 25 రోజుల్లో వెబ్ సిరీస్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడట. ఈ వెబ్ సిరీస్‌ని ఆహా కోసం చేయ‌నున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ద‌ర్శకుడితో పాటు వంశీ పైడి ప‌ల్లి కూడా `ఆహా` కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇలా ముగ్గురు స్టార్ డైరెక్టర్‌లు  ఆహా కోసం వెబ్ సిరీస్ బాట ప‌ట్టనుండడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.

 

 

Leave a comment

error: Content is protected !!