Shopping Cart 0 items - $0.00 0

కరోనా వైరస్ నివారణ కోసం అనూహ్యంగా స్పందిస్తోన్న టాలీవుడ్ తారలు

 

 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ విపత్కరమైన పరిస్థితుల్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ నివారణ కోసం సినీ పరిశ్రమ నుంచి చాలా మంది చాలా పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు.  అందులో కొందరు దేశ ప్రజల సంక్షేమం కొరకు స్పందిస్తుంటే.. మరికొందరు సినీ పరిశ్రమలోని వర్కర్స్ సంక్షేమాన్ని కోరుకుంటూ విరాళాలిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ నివారణార్ధం టాలీవుడ్ వర్కర్స్ కోసం  రూ. 1కోటి విరాళంగా ప్రకటించగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి మొత్తం  రూ.1 కోటి విరాళంగా ప్రకటించారు.  ఇక స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సైతం కరోనా నివారణకు ఆంధ్ర, తెలంగాణా ముఖ్యమంత్రి సహాయ నిధికి మొత్తం రూ. 5లక్షలు విరాళం గా ప్రకటించి .. సినీ వర్గాలు, సామాన్యులనుంచి ప్రశంసలు అందుకున్నారు.

 

Leave a comment

error: Content is protected !!