Tollywood : తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన కారణంగా కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటులు అల్లు అర్జున్ అలీ, వరద బాధితులకు అండగా నిలిచి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. వరదల వల్ల ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని, అల్లు అర్జున్ తన వంతు సహాయంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూపాయలను విరాళంగా అందించారు.

అలాగే..  ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ .. వరదబాధితుల సహాాయార్ధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి  సీయమ్ రిలీఫ్ ఫండ్ గా రూ. 25 లక్షల విరాళాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందించారు.

వరదల కారణంగా జరిగిన నష్టం తనను ఎంతగా బాధపెట్టిందో వ్యక్తం చేస్తూ, ప్రజలందరూ త్వరగా ఈ విపత్తు నుండి బయటపడాలని ఆ దేవుడిని ప్రార్థించారు. ప్రముఖ నటుడు అలీ , ఆయన కుటుంబం కూడా వరద బాధితులకు సహాయం చేయాలని నిర్ణయించు కున్నారు.  ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు , తెలంగాణాకు 3 లక్షలు అంటే మొత్తం 6 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందజేస్తామని తెలిపారు. వరద బాధితుల పరిస్థితిపై ఆందోళన: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితి చూసి తాను మరియు తన భార్య జుబేదా ఎంతో బాధపడ్డామని వెల్లడించారు. ఇలాంటి విపత్తు సమయంలో ఆ ఇద్దరు నటులు ఇలా ముందుకు వచ్చి సహాయం చేయడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కష్ట సమయంలో ముందుకు వచ్చి వారు చేస్తున్న సహాయం ప్రశంసనీయం.

Leave a comment

error: Content is protected !!