చిత్రం’ మూవీ ద్వారా ఉదయ్ కిరణ్ ను, ‘జయం’ చిత్రం ద్వారా నితిన్ ను, ‘జై’ చిత్రం ద్వారా నవదీప్ ను, ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రం ద్వారా కాజల్ అగర్వాల్ ను, కేక సినిమా ద్వారా సిరివెన్నెల తనయుడు రాజాను  టాలీవుడ్ కు పరిచయం చేసిన క్రెడిట్ దర్శకుడు తేజదే. ఇప్పటికీ ఇంకా  యువ తరానికి సినీ అవకాశాలు ఇవ్వడంలో తేజ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు . తన పుట్టినరోజున దర్శకుడు తేజ తన తదుపరి రెండు చిత్రాల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాక్షస రాజు రావణసురుడు- అలిమేలు మాంగ వెంకట రమణ వంటి టైటిల్స్ ని ప్రకటించారు. రానా.. గోపిచంద్ లాంటి హీరోల్ని ఎంపిక చేసుకున్నారు. అయితే వీటిలో కొన్ని పాత్రల్లో నటించాడానికి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నాడు తేజ.

కరోనా లాక్ డౌన్ కారణంగా.. ఈ రెండు సినిమాలు కొంత సస్పెన్స్ లో పడ్డాయి. ఎట్టకేలకు వీటికి కాస్టింగ్ ఎంపిక చేసేందుకు తేజ సిద్ధమవుతున్నారు. ఆయన తొలిసారిగా టాలీవుడ్లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా పరిశ్రమకు కొత్త ప్రతిభను పరిచయం చేయడానికి లైవ్ ఆడిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. హలో యాప్ లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులు మాత్రమే తుది ఆడిషన్ కు తీసుకుంటామని తెలిపారు.  మరి వీరిలో ఎంత మంది  ఆ రెండు చిత్రాల్లోనూ కొత్తగా పరిచయం అవుతారో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!