‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా అడుగుపెట్టింది అందాల తాప్సీ. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లోనూ అందాల ఆరబోతను కంటిన్యూ చేసింది. అయినా సరే అమ్మడికి ఇక్కడ కాలం కలిసిరాలేదు. ఎప్పుడైతే బాలీవుడ్ లో బేబీ మూవీతో తన కెరీర్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి తాప్సీకి అక్కడ పట్టిందల్లా బంగారమే అవుతోంది. గ్లామరస్ రోల్స్ ను పక్కనపెట్టి.. నాయికా ప్రధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ..తనలోని బెస్ట్  పెర్ఫార్మర్ ను వెలుగులోకి తెచ్చింది. ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ తెరకు లక్కీ గాళ్. ఆమె నటించిన చిత్రాలు అక్కడ కోట్లు కురిపిస్తున్నాయి.  2019 లో అయితే ఆమె చిత్రాలు ఏకంగా మూడొందల కోట్లకు పైగానే  కొల్లగొట్టడం విశేషంగా మారింది.

2019లో ఆమె నటించిన ‘బద్లా’, ‘గేమ్‌ ఓవర్‌’తోపాటు మరో మూడు చిత్రాలు విడుదలై.. మంచి టాక్‌ అందుకున్నాయి. కాగా ఇవన్నీ రూ.352.13 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇందులో కేవలం ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా రూ.200 కోట్లు సాధించింది. తాప్సి గత ఐదు సినిమాలు ‘బద్లా’ రూ.88 కోట్లు , ‘గేమ్‌ ఓవర్‌’ రూ.4.69 కోట్లు , ‘మిషన్‌ మంగళ్‌’ రూ.202.98 కోట్లు, ‘సాండ్‌కీ ఆంఖ్‌’ రూ.23.40 కోట్లు, ‘థప్పడ్‌’ రూ.33.06 కోట్లు ..  మొత్తం రూ.352.13 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 2019లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన నటిగా తాప్సి నిలిచారని అన్నారు.

 

Leave a comment

error: Content is protected !!