2021 తమిళనాట ఎన్నికలు మొదలయ్యాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. హీరో విజయ్ సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఆయన అందరికంటే భిన్నంగా  ఇంటి నుండి సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఆయన ఓటు వేశారు. ఆయన్ను చూసిన జనం పోలింగ్ బూత్ వరకు ఫాలో అయ్యారు. అయితే విజయ్ ఇలా సైకిల్ మీద రావడం వెనుక ఒక మెసేజ్ కూడా ఉందని అంటున్నారు కొందరు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయనే సందేశం ఇవ్వడం కోసమే విజయ్ ఇలా సైకిల్ మీద వచ్చి ఉంటాడని విజయ్ ను చూసిన వారు భావిస్తునారు. ఓటు వినియోగించుకున్న సెలబ్రిటీలలో రజినీకాంత్, సూర్య, కార్తీ, ప్రభు, శివ కార్తికేయన్, అజిత్, కమల్ హాసన్, శృతి హాసన్, ఖుష్బు అందరూ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Leave a comment

error: Content is protected !!