ప్రస్తుతం గోపీచంద్, తమన్నా జంటగా సంపత్‌ నంది దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. ఈ సినిమాలో తన పాత్రకి స్వయంగా డబ్బింగ్‌ పూర్తి చేసిన తమన్నా మాట్లాడుతూ – ‘‘ తనని నమ్మి ‘సీటీమార్‌’లో జ్వాలారెడ్డి పాత్రకు ఎంపిక చేసుకున్న సంపత్‌కి చాలా థ్యాంక్స్‌. ఇందులో తన పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుంది’’ అన్నారు. ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్‌ పూర్తయిందోచ్‌ అంటూ ఫుల్‌ జోష్‌గా ఉన్న ఓ ఫొటోను సోషియల్ మీడియాలో షేర్‌ చేశారు తమన్నా. మరి ఇక తమన్నా జ్వాలారెడ్డి పాత్రలో తెలంగాణ యాస ఎలా మాట్లాడారో వినాలంటే మాత్రం ఏప్రిల్‌ 2 వరకూ ఆగాల్సిందే. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదలకానుంది.

Leave a comment

error: Content is protected !!